Chitram news
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 5:13 pm Editor : Chitram news

ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిసిన ఎస్టీ పర్ధాన్ సంఘం నాయకులు

ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిసిన ఎస్టీ పర్ధాన్ సంఘం నాయకులు

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలో ఎస్టీ పర్ధాన్ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయమై ఆదివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ రాకేష్ రెడ్డి, జైనథ్ వార్డు మెంబర్ కోవా సారథి, అశోక్, సత్యనారాయణ, తులసి రామ్, నాగేష్, యోగేష్, నరేష్, ఆకాష్, లక్మన్, కిషోర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.