జాతీయ జెండాను ఎగరేయని టీజీబీ బ్యాంక్ మేనేజర్పై ఫిర్యాదు
చిత్రం న్యూస్, జైనథ్: దేశమంతటా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తుంటే, జైనథ్ మండలం కరంజి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)లో శనివారం మువ్వన్నెల జెండా ఎగరలేదు. జెండా పండగకు రావాలని స్థానిక నేతలు ఫోన్ చేయగా.. జెండా ఎగురవేసే పనిలేదని బ్యాంక్ మేనేజర్ మంగేశ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు, నేతలు బిక్కి గంగన్న, ఎల్టి జగదీశ్ రెడ్డి, దర్శనాల అశోక్ లు బ్యాంక్ మేనేజర్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జైనథ్ ఎస్ఐ గౌతమ్ పవార్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.