Chitram news
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 4:03 pm Editor : Chitram news

వన మహోత్సవాన్ని ప్రారంభించిన పెద్దాపురం  ఏడవ అదనపు  జిల్లా జడ్జి సరస్వతి

వన మహోత్సవాన్ని ప్రారంభించిన పెద్దాపురం  ఏడవ అదనపు  జిల్లా జడ్జి సరస్వతి

చిత్రం న్యూస్, పెద్దాపురం:  స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దాపురం కోర్టు ప్రాంగణంలో  ఏడవ అదనపు జిల్లా జడ్జి N. సరస్వతి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కలు నాటడం వల్ల  పెరుగుతున్న కాలుష్యాన్ని కొద్ది వరకైనా తగ్గించవచ్చని అన్నారు.  తన చేతుల మీదుగా మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.