Chitram news
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:37 pm Editor : Chitram news

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: 7వ అదనపు జిల్లా జడ్జి ఎన్. సరస్వతి

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: 7వ అదనపు జిల్లా జడ్జి ఎన్. సరస్వతి

చిత్రం న్యూస్, పెద్దాపురం: సెప్టెంబర్ 12న జరిగే నేషనల్ లోక్  అదాలత్ ను  కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని,రాజీ మార్గమే రాజ మార్గమని 7వ అదనపు జిల్లా జడ్జి  ఎన్. సరస్వతి అన్నారు. పెద్దాపురం కోర్టు హాల్ లో శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న  యాక్సిడెంట్, సివిల్, క్రిమినల్ కేసులు వంటివి పరిష్కరిస్తారని తెలిపారు. పరిష్కార కేసులు: రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద నష్టపరిహారం, బ్యాంక్ రికవరీ, కార్మిక వివాదాలు, సివిల్ వివాదాలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. రాజీపడిన కేసులకు కోర్టు ఫీజు పూర్తిగా వాపస్ ఇవ్వబడుతుందన్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరి తక్షణ సత్వర న్యాయం లభిస్తుందని, దీనిపై ఎటువంటి అప్పీల్ ఉండదన్నారు.