Chitram news
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 11:32 am Editor : Chitram news

అనుమానాస్పదంగా చిరుత మృతి

చిత్రం న్యూస్, చంద్రాపూర్: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సిందేవాహి అటవీ క్షేత్రం నవర్గావ్_పెండ్రి రోడ్డు పక్కన మూడేళ్ల చిరుతపులి అనుమానస్పదంగా మృతిచెందింది. గ్రామస్తులకు ఉదయం నీరసంగా కనిపించిన చిరుతపులి లేచి నడిచేందుకు ప్రయత్నించి అక్కడే కుప్పకూలింది. చిరుత మృతిపై అటవీశాఖ అధికారులు ఆరాతీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మృతికి కారణాలు తెలియనుంది.