Chitram news
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 5:59 pm Editor : Chitram news

బేలకు రెండో విడత ఇళ్లలో ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు వినతి

బేలకు రెండో విడత ఇళ్లలో ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు వినతి

చిత్రం న్యూస్, బేల: రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియలో భాగంగా బేల మండల కేంద్రంలోని నిరుపేదలకు ఎమ్మెల్యే కోటా కింద అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక వార్డు సభ్యులు, నాయకులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కోరారు. ఇళ్లు లేని అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని 11వ వార్డులో గల విట్టల్–రుకుంబాయి మందిరం వెనకాల నూతన డ్రైనేజీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ప్రస్తుతం అక్కడ ఉన్న డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు సభ్యులు నవీన్, సతీష్, మాడ హరీష్ రెడ్డి, జఫర్ తదితరులు పాల్గొన్నారు.