Chitram news
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 4:58 pm Editor : Chitram news

ఘనంగా సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు

 ఘనంగా సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్ బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. అభిమానులు, స్థానిక పలు సర్పంచులు రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు జాదవ్ నరేష్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరి నడుమ రూపేష్ రెడ్డి కేకు కట్ చేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ళు జీవించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ఈ సందర్బంగా  కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు జాదవ్ నరేష్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో మండలంలోని గిరిజనులకు, నిరుపేదలకు ఏ చిన్న పని ఉన్న రుపేష్ రెడ్డి అంబులెన్స్ ల పని చేయడం అభినందనీయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో కూడా క్రియాశీలకంగా పని చేస్తున్నారన్నారు.అన్ని దానాల్లో రక్తదానం గొప్పదానం అని పేర్కొన్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 101 మంది కి పైగా రక్తదానము చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.