యువతకు ఉపాధి బాట: ఆదిలాబాద్లో కెరీర్ గైడెన్స్ సదస్సు ప్రారంభం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో యువతకు కెరీర్ గైడెన్స్, స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. జిల్లా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నైపుణ్య శిక్షణ కేంద్రాల ప్రతినిధులు, అధికారులను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ శ్రీనివాస్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ మనోహర్, జిల్లా ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పార్థసారథి, ఉట్నూరు, ఆదిలాబాద్ ATC ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్, శ్రీనివాస్, బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు ప్రవీణ్, రమేష్, NTT డేటా ప్రతినిధి మల్లికార్జున్, కళా అకాడమీ లెక్చరర్ వైష్ణవి, ఎన్లాప్స్ ఇండియా ప్రతినిధి ప్రణవి, పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.