Chitram news
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 3:44 pm Editor : Chitram news

ఆలయ అభివృద్ధి కోసం ఐదు గంటల భూమి విరాళం

ఆలయ అభివృద్ధి కోసం ఐదు గంటల భూమి విరాళం

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రేణుకాపూర్ హనుమాన్ ఆలయం అభివృద్ధి కొరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన గౌతమ్ స్వచ్ఛందంగా ఐదు గుంటల భూమిని ఆలయానికి విరాళంగా అందజేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయన్ను శాలువాతో సన్మానించి, స్వామివారి తీర్థప్రసాలను అందజేశారు. ఆలయ పునర్నిర్మాణం ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ నూతన కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పనులు జరుగుతాయనీ ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు, భక్తులు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.