Chitram news
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 10:39 am Editor : Chitram news

కాంగ్రెస్ జైనథ్ మండల అధ్యక్షుడిగా గడ్డం జగదీష్ రెడ్డి

 కాంగ్రెస్ జైనథ్ మండల అధ్యక్షుడిగా గడ్డం జగదీష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ జైనథ్ మండల అధ్యక్షుడిగా గడ్డం జగదీష్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు ఆయన నియామకం జరిగింది.  జైనథ్ మండల కేంద్రానికి చెందిన ఆయనకు పార్టీ అధిష్టానం పదవిని కట్టబెట్టింది. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం జగదీష్ రెడ్డిని మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.