మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి కంది శ్రీనివాస రెడ్డి సన్మానం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ తన్వీర్ హైమద్లను కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లు కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయానికి గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి వారిని శాలువాతో సన్మానించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి కంది శ్రీనివాస రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
