ఏబీవీపీ టీటీసీ ఉచిత కోచింగ్ ముగింపు
*ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్:
ఏబీవీపీ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీటీసీ ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యార్థులకు పాయల్ ఫౌండేషన్ తరఫున స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక సేవలో ఏబీవీపీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. జాతీయవాదం, దేశభక్తి, క్రమశిక్షణతో కూడిన విలువల విద్యను అందించడంలో ఏబీవీపీ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్, జిల్లా ప్రముఖ్ రవికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్, ఎంఈఓ సోమయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
