Chitram news
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 9:33 pm Editor : Chitram news

బాసర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

బాసర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన 90 రోజుల హుండీ ద్వారా భారీ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనీదేవి తెలిపారు. గురువారం అక్షరాభ్యాస మండపంలో హుండీ ఆదాయం లెక్కించారు. ఇందులో 1 కోటి 03 లక్షల 75 వేల 308 రూపాయల ఆదాయం సమకూరగా..మిశ్రమ బంగారం 40.గ్రా.200మిల్లీ గ్రా, మిశ్రమ వెండి 02కిలోల 550గ్రాములు, విదేశీ కరెన్సీ 24 nos నోట్లు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో  ఏఈఓ గంగ ప్రసాద్, ఆలయ అధికారులు, బ్యాంకు సిబ్బంది, స్వచ్ఛంద సేవ భక్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.