Chitram news
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 7:13 pm Editor : Chitram news

జైనథ్ మార్కెట్ యార్డులో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం

జైనథ్ మార్కెట్ యార్డులో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం

చిత్రం న్యూస్,జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు జొన్న పంట విక్రయించేందుకు వచ్చిన రైతులకు మంగళవారం పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మార్కెట్‌కు వచ్చే రైతులు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేపట్టింది. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పాయల్ ఫౌండేషన్ చైర్మన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మార్గదర్శకత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయల్ శంకర్ ఫౌండేషన్ సభ్యులు, బీజేపీ జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, నాయకులు చిలుకూరి లింగారెడ్డి, అశోక్, సురేష్, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.