Chitram news
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 11:21 pm Editor : Chitram news

జనగణన-2027 హౌస్ లిస్టింగ్ ప్రక్రియపై కలెక్టర్ రాజర్షిషా జూమ్ కాన్ఫరెన్స్

జనగణన-2027 హౌస్ లిస్టింగ్ ప్రక్రియపై కలెక్టర్ రాజర్షిషా జూమ్ కాన్ఫరెన్స్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జనగణన-2027 హౌస్ లిస్టింగ్ (ఇండ్ల జాబితా) ప్రక్రియ, ఇతర కీలక అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు దిశానిర్దేశాలు చేశారు.జనగణన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఇండ్ల జాబితాను రూపొందించాలని సూచించారు. ఈ వర్చువల్ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్.చిత్రు, రాజేశ్వర్, డీఆర్ఓ స్రవంతి, వివిధ మండలాల తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్ శ్రీహరి, సూపర్వైజర్లు, టెక్నికల్ అసిస్టెంట్స్ ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.