Chitram news
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 3:53 pm Editor : Chitram news

బెల్లూరిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీఓ సుధీర్ కుమార్

బెల్లూరిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీఓ సుధీర్ కుమార్

జైనథ్, చిత్రం న్యూస్: మండలంలోని బెల్లూరి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జైనథ్ ఎంపీడీఓ సుధీర్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తయిన లబ్దిదారులు చివరి బిల్లు కోసం వేచి చూస్తున్నామని ఎంపీడీఓకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు దశల్లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోందని గుర్తు చేశారు. ఇండ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని ఆయన సూచించారు. మంజూరైన ఇండ్లను సకాలంలో పూర్తి చేసుకుంటే తదుపరి విడత నిధులు విడుదలవుతాయని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తయిన లబ్దిదారులు చివరి బిల్లు కోసం వేచి చూస్తున్నమని ఎంపీడీఓకి తెలియజేశారు. గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిరంతరం నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, ఫీల్డ్ అసిస్టెంట్ దత్తు, గ్రామస్తులు అభిజిత్ రెడ్డి, సుజీత్, మారుతి, లబ్ధిదారులు పాల్గొన్నారు.