చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ముడుపు మౌనిష్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భోరజ్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బుధవారం వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించేందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. మండుటెండలు పెరుగుతున్న నేపథ్యంలో బోరజ్ నుండి బేల వైపు వెళ్లే ప్రయాణికులు, కార్మికులు, వృద్ధులకు చల్లని తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో దాహం తీర్చడం ఒక సేవ అని అన్నారు. ఇలాంటి కార్యక్రమంలోప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. రోజంతా ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి స్నేహిత్, సాయి, అతర్వ తదితరులు పాల్గొన్నారు.
