Chitram news
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 5:47 pm Editor : Chitram news

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆదిలాబాద్‌లో గోడలపై పెయింటింగ్ వేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, తెలంగాణ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పారదర్శక పాలన కోసం ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు దినేష్, జోగు రవి, హనుమండ్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.