Chitram news
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 12:33 pm Editor : Chitram news

మాంగ్రూడ్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం 

మాంగ్రూడ్ గ్రామంలో రైతు ముంగిట్లోశాస్త్రవేత్తలు కార్యక్రమం 

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మాంగ్రూడ్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో  శాస్త్రవేత్తలు డాక్టర్.కె.రాజశేఖర్, డాక్టర్.ఎం.రాజేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ఉమర్, గ్రామ సర్పంచ్ పూజ, ఉప సర్పంచ్ పురుషోత్తం, సీపీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయం,  రసాయనాల ఎరువుల వాడకాన్ని తగ్గించడం, నీటి వినియోగాన్ని పెంచుకోవడం, మార్కెట్ కు అనుగుణంగా పంటలను పండించడం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ అంశాలతో పాటు రాబోవుకాలంలో వచ్చే వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ఏ విధమైన యాజమాన్య పద్ధతులు  పాటించాలో  రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంగేష్ టాక్రె, రైతులు తదితరులు పాల్గొన్నారు.