ఆదిలాబాద్ లో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, మార్కెట్ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతును సన్మానించి మిఠాయి తినిపించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం రైతులందరి నుండి జొన్న పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే షెడ్యూల్ కూడా వస్తుందని చెప్పారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఏవైనా సమస్యలుంటే రైతులు తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
