తెలంగాణ నూతన డీజీపీతో ఎమ్మెల్సీ కోదండరాం భేటీ
చిత్రం న్యూస్, బాసర : నూతనంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీ.వీ.ఆనంద్ ను శనివారం మర్యాదపూర్వకంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షులు, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో తెలంగాణ ఉద్యమం నాటి జ్ఞాపకాలను ఒకరినొకరు మాట్లాడుకుంటూ గుర్తుచేసుకున్నారు. పలు విషయాలపై చర్చించారు. వీరి వెంట నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ ఇన్ఛార్జి సర్దార్ వినోద్ కుమార్ ఉన్నారు
