నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసిన భైంసా మార్కెట్ ఛైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా ను బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు . అనంతరం కలెక్టర్ తో మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సాఫీగా కొనసాగుతున్నాయని, గన్నీ సంచులు సరిపడేంత కావాలని, లారీల గురించి వివరించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలో భైంసాకు వచ్చి రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. చైర్మన్ తో పాటు ఆత్మ కమిటీ చైర్మన్లు సిద్ధం వివేకానంద, గన్న నర్సారెడ్డి, తదితరులు ఉన్నారు.
