Chitram news
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 4:22 pm Editor : Chitram news

జొన్న,శనగ పంటలు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై రైతుల ధర్నా

జొన్న,శనగ పంటలు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై రైతుల ధర్నా

* రైతులకు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నేతలు 

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న, కొబ్బయి గ్రామాల రైతులు జొన్న, శనగ పంటలు కొనుగోలు చేపట్టాలని కోరుతూ 353బీ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దాదాపుగా రెండు గంటల వరకు రైతులు ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్థంభించింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పిన వినిపించుకోలేదు. మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ పార్టీ నేతలు రైతులకు మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ. గత వారం రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయిస్తానని చెప్పడంతో తాము పంటలను మార్కెట్ కు తీసుకొచ్చామని కానీ వారం రోజుల నుండి రైతులందరు మార్కెట్ లో పడిగాపులు కాస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. ప్రభుత్వం పంటలు కొనుగోలు చేస్తారా లేదా కొనుగోలు చేయకపోతే చెప్పండి తక్కువ ధరకు ప్రైవేట్ కు అమ్ముకుంటామని అన్నారు. మార్క్ ఫెడ్ డీఎం మాట్లాడుతూ 3 నుంచి జొన్న, 4వ తేదీ నుండి శనగ పంటను కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమం కళ్లెం ప్రమోద్ రెడ్డి, అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్, యువ నాయకుడు సతీష్ పవర్, గంబీర్ టాక్రె, విపిన్ ఖోడే, మంగేష్ టాక్రె, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.