నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసిన ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రాను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి పూలమొక్క అందజేశారు. ముథోల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రైతులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, సబ్ సెంటర్లలో గన్నీ బ్యాగులు, లారీల (రవాణా సౌకర్యాల) లోపం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్య సమస్యలను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వాటిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ భవేష్ మిశ్రా, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
