Chitram news
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 5:56 pm Editor : Chitram news

అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన కౌన్సిలర్ రజిత రాము 

అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన కౌన్సిలర్ రజిత రాము 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్:  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ అనాథ శవానికి ఏడో వార్డ్ కౌన్సిలర్ రజిత రాము శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. సొంతవారే పట్టించుకోని ఈ కాలంలో దిక్కు మొక్కు లేనివారు మృతి చెందితే ఆపదలో మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు.

గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో  కే ఆర్కే కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి వడ దెబ్బతో కిందపడి ఉండగా వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేసి రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు చికిత్స పొందుతూ చనిపోయారని డాక్టర్లు వెల్లడించారు. అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో   కౌన్సిలర్ రజిత రాము ముందుకొచ్చారు.

శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదిలాబాద్ మావల పోలీస్ స్టేషన్ కి కౌన్సిలర్  సమాచారం అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు కేఆర్కే స్మశాన వాటికలో అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గ్రూప్ అధ్యక్షులు లింగంపెల్లి శశికాంత్, విద్యుత్ ఏఈ జి.జనార్దన్ రెడ్డి, కళ్లెం హరీష్ రెడ్డి, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అలీం పాషా, బోధకుంట రాజు తదితరులు పాల్గొన్నారు.