Chitram news
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 5:26 pm Editor : Chitram news

జైనథ్ లో ఘనంగా బాజీరావ్ బాబా సప్తాహ వేడుకలు 

జైనథ్ లో ఘనంగా బాజీరావ్ బాబా సప్తాహ వేడుకలు 

* మాజీ మంత్రి జోగు రామన్న విరాళం

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న భాజీరావ్ బాబా మహారాజ్ సప్తాహ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న తన ఉదారతను చాటుకున్నారు. బాబా సప్తాహ ఉత్సవాల నిర్వహణ కోసం జోగు రామన్న తరపున ఆయన ప్రతినిధులు  బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం రూ. 11,116 నగదును విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు జోగు రామన్న ఎల్లప్పుడూ అండగా ఉంటారని, భక్తుల సౌకర్యార్థం ఈ చిన్న సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నేత,జైనథ్ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ యాదవ్, మాదస్తు వెంకన్న నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విరాళం అందించిన జోగు రామన్నకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.