Chitram news
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 11:41 am Editor : Chitram news

సిర్సన్న లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

సిర్సన్న లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంశుక్రవారం నిర్వహించారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు, శాస్త్రీయ పద్ధతులను రైతులకు నేరుగా అందించేందుకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం 27 ఏప్రిల్ నుంచి మే 23 వరకు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వ్యవసాయ, ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు గ్రామాల్లో పర్యటించి, నేల ఆరోగ్యం, అధిక దిగుబడి వంగడాలు, సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.

ఈ సందర్బంగా బేల మండలం సిర్సన్న గ్రామంలోని రైతువేదికలో జిల్లా వ్యవసాయ పరిశోదన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, రాజేందర్ రెడ్డి హాజరై రైతులకు సమగ్ర సస్యరక్షణ,తక్కువ ఖర్చు తో అధిక దిగుబడి మరియు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంటల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. రైతులు అధిక యూరియా వాడకం తగ్గించాలని కోరారు.ప్రతి సంవత్సరం పంట మార్పిడి తప్పకుండ చేయాలనీ, రసాయన ఎరువుల నియంత్రణను చేపట్టాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలను వాడకంతో పాటు సేంద్రియ సాగులను చేపట్టాలని కోరారు.