Chitram news
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 10:59 am Editor : Chitram news

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్.సరోజన రెడ్డి 

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ సరోజన రెడ్డి 

చిత్రం న్యూస్, బాసరదళారుల నుంచి రైతులను రక్షించి వారికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బాసర మండలం కీర్గుల్(బి)గ్రామ సర్పంచ్ తినేట్ల సరోజన రెడ్డి అన్నారు. గ్రామంలో శుక్రవారం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (బి) గ్రామానికి చెందిన ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేయడం జరిగిందని చెప్పారు.రైతుల సౌకర్యం కోసం ఎమ్మెల్యే రామారావు పటేల్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు సెంటర్ ను ఏర్పాటు చేయాలని తెలుపడంతో అధికారులు స్పందించారన్నారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.