నానో యూరియా, డీఏపీపై రైతులకు అవగాహన సదస్సు
చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామం లో నానో యూరియా, డీఏపీ పై గురువారం సహాయ వ్యసాయ సంచాలకులు శ్రీధర్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ..నానో ఫర్టిలైజర్స్ ఎంత మోతాదులో వాడాలి.. ఎలా వాడాలి సహకార దిగ్గజ సంస్థ లో ఒకటి “ఇఫ్కో” దేశీయంగా తయారు చేస్తున్న నానో యూరియా, నానో డీఏపీ, తదితర నానో ద్రవరూప ఎరువులు ప్రపంచంలో ఆరుదైనవన్నారు. వీటిని గత ఐదేళ్లుగా ఇఫ్కో రైతులకు విక్రయిస్తున్నారు. సంప్రదాయక గుళికల ఈ యూరియా డిఏపీ బదులుగా ద్రవ రూపంలో ఉండే నానో యూరియా, నానో డీఏపీ, నానో పోటాష్ ఎరువులు వాడినప్పుడు ఎటువంటి దిగుబడి నష్టం లేదని అధిక దిగుబడులే వస్తున్నాయని క్షేత్ర ప్రయోగాల ద్వారా నిరూపించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి, ఏఓ సాయితేజ రెడ్డి, ఇఫ్కో ప్రతినిధి నిఖిల్ గొర్లవర్, వ్యవసాయ విస్తరణ అధికారులు వినయ్, ఉమర్, వ్యవసాయ రైతులు గోపతి అమోల్, మహేందర్, నితిన్, సునీల్ గోహార్కర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
