మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్
చిత్రం న్యూస్, బాసర : గంజాయి వినియోగం, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని సీఐ కిరణ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో విస్తృతంగా, అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. గంజాయి వాడకం వల్ల కలిగే అనర్థాలపై బాసర ప్రజలకు, యువత, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు, యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని వివరించారు. ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్టాలు వినియోగించిన, విక్రయించిన సమాచారం తెలుపాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని బాసర సీఐ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
