Chitram news
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 1:19 pm Editor : Chitram news

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

చిత్రం న్యూస్ సైదాపూర్:  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. సైదాపూర్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పెండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. పాఠశాలల్లో ప్రవేశాలు, ప్లాంటేషన్, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు వేయాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల దత్తత ద్వారా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఓట్ల తొలగింపుపై బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం హుస్నాబాద్ నియోజకవర్గ గౌరవాన్ని పెంచుతున్నానని మంత్రి స్పష్టం చేశారు.