Chitram news
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 9:27 pm Editor : Chitram news

ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ అఖిల్ మహాజన్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజల సమస్యలను నేరుగా విని, వాటికి తక్షణ పరిష్కారం చూపేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ‘గ్రీవెన్స్ డే’ (ప్రజావాణి) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 36 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఇతర సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని, బాధితులకు భరోసా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందించాలనుకునే వారు 8712659973 అనే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, మీ వివరాలు రహస్యంగా ఉంచబడతాయని జిల్లా పోలీసు యంత్రాంగం తెలిపింది.