Chitram news
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 7:49 pm Editor : Chitram news

రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన యువకుడు

రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన యువకుడు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక రోగికి రక్తదానం చేసి ఒక యువకుడు తన ఉదారతను చాటుకున్నాడు. జైనూర్ మండలానికి చెందిన జ్యోతి లక్ష్మి అనే పేషెంట్ శరీరంలో రక్తం స్థాయి 6.6 కి పడిపోయింది. ఆమెకు అత్యవసరంగా ‘A పాజిటివ్’ (A+ve) రక్తం అవసరమైంది. రక్తం దొరక్క కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్న సమయంలో, ఈ విషయం శ్రీ వాసుకేదశ్వర ధామ్ ట్రస్ట్ సభ్యుడు ‘సాయి సనాతని’ కి తెలిసింది. వెంటనే స్పందించిన ఆయన, ఆదిలాబాద్‌లోని కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. సమయానికి స్పందించి ప్రాణదాతగా నిలిచిన సాయి సనాతనిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ వాసుకేదశ్వర ధామ్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు.