దుశ్చర్లను పరామర్శించిన సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
చిత్రం న్యూస్, సూర్యాపేట: ఇటీవల దాడిలో గాయపడి హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జన సాధన సమితి అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణను మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. సోమవారం ఆసువత్రికి వెళ్లిన ఆయన ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలన్నారు. ధైర్యంగా ఉండాలని దుశ్చర్లకు సూచించారు.