బేలలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రం లో సోమవారం ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ కళ్లెం ప్రమోద్ రెడ్డి తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఉద్యమ శక్తి బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన ఈ మహత్తర ప్రయాణం ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితం. గ్రామం నుంచి రాష్ట్రం వరకు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తూ, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణవాడికి గర్వకారణమన్నారు.
తెలంగాణ కోసం పుట్టి, తెలంగాణ కోసం పోరాడి, తెలంగాణ కోసం నిరంతరం సేవలందిస్తున్న ఈ పార్టీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఒల్లప్ వార్ దేవన్న, ఠాక్రె గంభీర్, అడాణేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, సర్పంచులు విపిన్ ఖోడె,కుడ్మెత శతృఘన్,వైద్య కిషన్ రావు, ఠాక్రే మంగేష్, మస్కె తేజరావు, పవార్ ప్రకాష్,కొడాపే అరుణ్, ధోటె ప్రఫుల్, చవాన్ సుధాకర్, సోడెం సురేష్,గోడె విశాల్,రాథోడ్ మాధవ్, పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.