Chitram news
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 2:45 pm Editor : Chitram news

ఘనంగా బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం: ఆదిలాబాద్‌లో జోగు రామన్న ఆధ్వర్యంలో వేడుకలు

ఘనంగా బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం: ఆదిలాబాద్‌లో జోగు రామన్న ఆధ్వర్యంలో వేడుకలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి , బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ జెండాను ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 27 ఏప్రిల్ 2001న జలదృశ్యంలో కేసీఆర్ నేతృత్వంలో స్థాపించబడిన ఈ పార్టీ, నేటికి 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ ఏట (రజతోత్సవ ఏడాది) అడుగుపెడుతోందని తెలిపారు.తెలంగాణ ఆత్మగౌరవం కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో మిఠాయిలు పంపిణీ చేశారు, జై తెలంగాణ నినాదాలతో కార్యాలయం మారుమోగింది. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి బీఆర్‌ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.