జైనథ్ లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
చిత్రం న్యూస్, జైనథ్: భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జైనథ్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాలే ధ్యేయంగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పులవేణి గణేష్ యాదవ్, లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, నితిన్ రెడ్డి, దీపాయిగుడ ఉప సర్పంచ్ స్వామి, మాదస్తు వెంకన్న, పిడుగు స్వామి యాదవ్, అశన్న,పార్టీ ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.