సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం: హాజరైన యువజన కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్ రెడ్డి
చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని సాంగిడి గ్రామానికి చెందిన బోరత్ వార్ అమ్మక్క-రాజు దంపతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ‘సారె’ అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు సొంత ఇంటి కల నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. బేల మండలంలో అర్హులైన వారందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్, సామ నర్సారెడ్డి, వార్డ్ మెంబర్ మంచికంటి ఉషన్న, మంచికంటి సాయి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, నల్ల వెంకట్ రెడ్డి, ప్రకాష్ నవగరే, రవీందర్ పటేల్, దేవన్న, సుధాకర్, సతీష్, సామ గణేష్ రెడ్డి, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.