Chitram news
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 6:12 pm Editor : Chitram news

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మైనార్టీ గురుకుల విద్యార్ధులకు కలెక్టర్ రాజర్షి షా ఘన సన్మానం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మైనార్టీ గురుకుల విద్యార్ధులకు కలెక్టర్ రాజర్షి షా ఘన సన్మానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ‘ప్రజాపాలన – ప్రత్యేక ప్రణాళిక సంక్షేమ వారోత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని బంగారిగూడ మైనార్టీ గురుకుల బాలికల కళాశాల-2లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాలకు పేరు తెచ్చిన విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కలీం అహ్మద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, మావల ఇంచార్జ్ ఎంపీడీవో కృష్ణవేణి, మైనార్టీ బాలికల కళాశాల-1 ప్రిన్సిపల్ ఫర్హీన్ సుల్తానా, మైనార్టీ బాలికల కళాశాల-2 ప్రిన్సిపల్ రజిని, అధ్యాపకులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు.