Chitram news
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 5:58 pm Editor : Chitram news

బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌ సాయితేజను అభినందించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌ సాయితేజను అభినందించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ నాయకుడు కుమ్మరి పెళ్లి సాయితేజను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా సాయితేజను శాలువాతో సన్మానించిన ఎంపీ రఘునందన్ రావు, ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ పటిష్టత కోసం ముఖ్యంగా సోషల్ మీడియాలో బీజేపీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువ నాయకత్వం కీలక పాత్ర పోషించాలని రఘునందన్ రావు ఆకాంక్షించారు. సాయితేజ తన కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకాన్ని ఈ సందర్భంగా ఎంపీ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు