విశ్వప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
చిత్రం న్యూస్, మంచిర్యాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీ విశ్వప్రసాద్ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో, వారి కుటుంబాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు.
శుక్రవారం మంచిర్యాలలోని విశ్వప్రసాద్ నివాసానికి వెళ్లిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంఛు శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్, ఇతర నేతలు ఆయనను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పరామర్శించిన వారిలో ఆదిలాబాద్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మల్లేష్, బోథ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆదిలాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్,n జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు