అసిస్టెంట్ ట్రెజరీ అధికారికి ఘనంగా సన్మానం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఇటీవల అసిస్టెంట్ ట్రెజరీ అధికారిగా (FAC) బాధ్యతలు స్వీకరించిన పి.వి.రమణ చారి ను జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అదిలాబాద్ జిల్లా టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వివిధ డిపార్ట్మెంట్ల బిల్లులు సత్వరమే పాస్ చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఏ. నవీన్ కుమార్, టీఎన్జీవో కేంద్ర సభ్యులు తిరుమల్ రెడ్డి, జిల్లా సభ్యులు, చంద్ర మోహన్ రెడ్డి, యస్ రాజేశ్వర్, అదిప నారాయణ, రవి, అదిలాబాద్ రూరల్ తాలూకా అధ్యక్షులు అసురీ ప్రవీణ్, అర్బన్ కార్యదర్శి కె. అరుణ్ కుమార్ , సభ్యులు, దుర్గయ్య, సోహైల్, శ్రీనివాస్, నవీన్ కుమార్, కలీo, అఖిల్ వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.