Chitram news
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 10:01 pm Editor : Chitram news

రెండు రోజుల్లో శనగల కొనుగోలు పునఃప్రారంభం: ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: మార్కెట్ యార్డుల్లో నిలిచిపోయిన శనగల కొనుగోలు ప్రక్రియపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక ప్రకటన చేశారు. శనగల కొనుగోలు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులకు భరోసా కల్పించారు. మార్కెట్ యార్డుల్లో శనగల కొనుగోలు మధ్యంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో,ఎమ్మెల్యే వెంటనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపగా, మిగిలిన శనగలను కూడా తక్షణమే కొనుగోలు చేయాలని ఆయన కోరగా, మంత్రులు సానుకూలంగా స్పందించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. మరో రెండు రోజుల్లో శనగల కొనుగోలు ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.