తొర్తి గ్రామాన్ని సందర్శించిన ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీయ
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తొర్తి గ్రామ రైతులు ప్రజావాణిలో దరఖాస్తు చేసిన విషయం విచారణ కోసం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మమాల్వీయ మంగళవారం తొర్తి గ్రామాన్ని సందర్శించారు. తమ గ్రామానికి చెందిన మురుగు కాలువ (డ్రైనేజీ) నీళ్ళు తమ పంట పొలాలకు వచ్చి నష్టము జరుగుతుందని రైతులు సోమవారం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రజావాణిలో విన్నవించిన ప్రకారం రైతుల పంట పొలాలను, మురుగు కాలువను సబ్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తొర్తి గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద భూమేశ్వర్, బాధిత రైతులు, గ్రామపెద్దలు, గ్రామస్తులతో మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల తహసీల్దార్ జె మల్లయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్ము ఇరిగేషన్ ఈ ఈ, ఎంపీఓ శివ చరణ్, ఏఈ ఇరిగేషన్, ఉప సర్పంచ్ సుమన్ గౌడ్, గామ పంచాయతీ కార్యదర్శి అనిల్, గ్రామ రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.