Chitram news
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 9:37 pm Editor : Chitram news

రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.6.33 కోట్ల నిధుల ఆమోదం: అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన కలెక్టర్, ప్రజా ప్రతినిధులు 

  1. రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.6.33 కోట్ల నిధుల ఆమోదం: అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన కలెక్టర్, ప్రజా ప్రతినిధులు 

చిత్రం న్యూస్ ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ (RIMS) ఆసుపత్రి అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుదలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ, సుమారు  రూ.6.33 కోట్ల విలువైన అభివృద్ధి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అనంతరం రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీ.టీ.జీ (C.T.G) యంత్రాలను, ఇతర వైద్య పరికరాలను కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ భొజ్జు పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, కొత్త పరికరాల అందుబాటుతో వైద్య సేవలు మరింత వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న వసతులు ఇంకా మెరుగుపరచవలసిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దీపక్ పుష్కర్, వివిధ విభాగాల అధిపతులు రిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.