పోలీస్ సిబ్బందికి యూనిఫాం ఆర్టికల్స్ పంపిణీ చేసిన సీపీ సాయి చైతన్య
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జిల్లాలో ట్రాఫిక్, పోలీసు సిబ్బందికి అవసరమైన కూలింగ్ అద్దాలు, యూనిఫామ్ ఆర్టికల్స్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి అందిన ఈ సామాగ్రిని సీపీ చేతుల మీదుగా మంగళవారం పోలీస్ సిబ్బందికి అందజేశారు. టాఫిక్ డ్యూటీలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్యం, భద్రత దృష్యా ఈ సామగ్రి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఏఆర్) రామచందర్రావు, రిజర్వ్ ఇన్స్ పెక్టర్ ధరణి కుమార్,వెల్పేర్ ఆర్.ఐ సతీష్, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్ సిబ్బంది పాల్గొన్నారు.