Chitram news
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 7:25 pm Editor : Chitram news

మానవత్వాన్ని చాటుకున్న కౌన్సిలర్: అత్యవసర స్థితిలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు

మానవత్వాన్ని చాటుకున్న కౌన్సిలర్: అత్యవసర స్థితిలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌసియా బేగం అనే మహిళకు సకాలంలో రక్తం అందించి కౌన్సిలర్ పర్వేజ్ అతని స్నేహితుడు జహీర్ తమ ఉదారతను చాటుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గౌసియా బేగం కాళ్లకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ కావడంతో వైద్యులు ఆమెకు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అయితే ఆమెది అరుదైన ‘A- నెగటివ్’ (A- Negative) బ్లడ్ గ్రూప్ కావడంతో రక్తం దొరకడం కష్టమైంది. ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త మానే శంకర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రక్తదాతలు కావాలని కోరారు.

ఈ పోస్ట్‌ను గమనించిన 32వ వార్డు కౌన్సిలర్ పర్వేజ్ వెంటనే స్పందించారు. తన స్నేహితుడు జహీర్ బ్లడ్ గ్రూప్ కూడా ‘A- నెగటివ్’ కావడంతో, అతడిని ఒప్పించి రిమ్స్ ఆసుపత్రికి పంపించారు. జహీర్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేయడంతో గౌసియా బేగం ఆపరేషన్‌కు మార్గం సుగమమైంది. సమయానికి స్పందించి ప్రాణదాతలుగా నిలిచిన పర్వేజ్, జహీర్‌ను స్థానికులు, బాధితురాలి కుటుంబ సభ్యులు అభినందించారు.