అత్యవసర సమయంలో అండగా..సీఎం సహాయనిధి
*రూ5లక్షల ఎల్ వో సీ లెటర్ ను అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామానికి చెందిన పోతుగంటి లత అనారోగ్య సమస్యలతో.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో రూ.5లక్షలకు సంబంధించి ఎల్ వో సీ లెటర్ ను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మేల్యే తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు.ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు వారి గ్రామస్తులు ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.