ఆదివాసీ అమరవీరులకు ఎంపీ గోడం నగేష్ నివాళి
చిత్రం న్యూస్, ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లిలోని ఆదివాసీ అమరవీరుల స్తూపం వద్ద ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తాటిపెల్లి గంగాధర్ రావుతో పాటు పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. వారిలో ఇంద్రవెల్లి మండల నాయకులు, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, బీజేపీ మండల అధ్యక్షులు కేంద్రే బాలాజీ, మాజీ జెడ్పీటీసీ కనక తుకారాం, మారుతి, దీపక్ సింగ్ శేఖావత్ రాజ్ వర్ధన్, పుష్పలత, సర్పంచ్ కోరేంగ సుంగు, తోడసం నాగోరావు, కనక హన్మంత్ రావు, రాజ్ లింగు వంటి ఆదివాసీ నాయకులు మరియు ఇతర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.