Chitram news
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 9:06 pm Editor : Chitram news

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన సామ రూపేష్ రెడ్డి

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన ముక్కె సవిత దీపక్ కు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తికాగా  సోమవారం గృహప్రవేశ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి హాజరయ్యారు. ముక్కె సవిత దీపక్ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు.బేల మండలంలో అర్హులైన వారందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని,ఎవరు ఆందోళన చెందవద్దన్నారు.

కార్యక్రమంలో బేల మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్,మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాందాస్ నాక్లే, సర్పంచ్ శంకర్,బాపు రావు, ఉప సర్పంచ్ సాగర్, జైనథ్ మార్కెట్ కమిటీ సొసైటీ డైరెక్టర్ మాడవి చంద్రకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.